SSC Student wrote WARNING LETTER in Exam Paper for pass marks



పరీక్షల్లో ఫెయిల్ చేశారంటే మంత్రాలతో మీ ఫ్యామిలీనంతా మటాష్ చేస్తాననంటూ ఓ విద్యార్థి టీచర్లను బెదిరించాడు. ఆ విద్యార్థి పదో పరీక్షలు రాశాడు. అయితే సరిగ్గా రాయలేదో ఏమో... పేపర్లు దిద్దే టీచర్లను ఉద్దేశించి ఓ లేఖ రాసి సమాధానపత్రానికి జత చేశాడు.

తనను పరీక్షల్లో ఫెయిల్ చేశారంటే, మీతో పాటు మీ ఇంట్లో వారందరినీ మంత్రాలతో చంపేస్తానని ఆ లేఖలో బెదిరించాడు. ఆ విద్యార్థి రాసిన లేఖను కర్ణాటక విద్యాశాఖాధికారులు విడుదల చేశారు. 

ఈ విద్యార్థి హరిహర ప్రాంతానికి చెందినవాడని వెల్లడించిన అధికారులు మరిన్ని వివరాలు చెప్పేందుకు మాత్రం నిరాకరించారు. తనను ఫెయిల్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపిన విద్యార్థి, తన సమాధాన పత్రం చూడకుండా పాస్ చేసేయాలని కూడా డిమాండ్ చేశాడట.

మన తెలంగాణా విద్యార్టులరా జర బద్రం

Comments