గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కింద ఉన్న గురుకులానికి కొత్తగా 22 పోస్టులను మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం. నిజామాబాద్ జిల్లా మానాలలో బాలికల గురుకుల విద్యాలయాన్ని ఇటీవల ప్రారంభించారు. దీనికి 22 బోధన, బోధనేతర పోస్టుల కోసం ఆ శాఖ ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం ఆ పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి శివశంకర్ నిన్న(శుక్రవారం) ఉత్తర్వులు జారీచేశారు. వీటితోపాటు ఒక జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్, కుక్, కిచెన్ హెల్పర్, మల్టీపర్పస్ వర్కర్లను ఔట్సోర్సింగ్లో తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.
Subscribe to:
Post Comments (
Atom)
Comments
Post a Comment